- తక్కువ ఖర్చుతో భూగర్భ జలాల్లోని ఫ్లోరైడ్, ఐరన్, ఆర్సెనిక్ వంటి హానికారకాలను తొలగించే కొత్త వ్యవస్థను ఐఐటీ గువాహటి అభివృద్ధి చేసింది.
- ఈ వ్యవస్థ ద్వారా రోజుకు 20 వేల లీటర్ల కలుషిత నీటిని శుద్ధి చేయవచ్చని ఐఐటీ గువాహటి పరిశోధకులు పేర్కొన్నారు.
- ఈ వివరాలు ప్రతిష్ఠాత్మక ‘ఏసీఎస్ఈఎస్అండ్ వాటర్’ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. దీని ప్రకారం నాలుగు అంచెల వ్యవస్థ కలిగిన ఈ యంత్రం తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుంది.
- రూ.20 ఖర్చుతో వెయ్యి లీటర్ల నీటి నుంచి ఫ్లోరైడ్, ఐరన్, ఆర్సెనిక్ వంటి హానికారకాలను తొలగిస్తుంది. ఈ యంత్రాన్ని 12 వారాల పాటు క్షేత్రస్థాయిలో ఉపయోగించి చూడగా 94% ఐరన్, 89% ఫ్లోరైడ్ ను ఇది తొలగించి, నీటిని నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా మార్చింది.
- ఆరు నెలలకొకసారి ఈ వ్యవస్థలోని ఎలక్ట్రోడ్ ను మార్చుకుంటే ఈ యంత్రాన్ని 15 ఏళ్లపాటు వాడుకోవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు
