- భారత జావెలిన్ త్రో నీరజ్ చోప్రా పారిస్ డైమండ్ లీగ్లో 88.16 మీటర్ల భారీ త్రోతో విజేతగా నిలిచాడు.ఇది అతనికి రెండేళ్లలో తన తొలి డైమండ్ లీగ్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.
- ఈ పోటీలో జర్మనీకి చెందిన జులియన్ వెబర్ 87.88 మీటర్లతో రెండో స్థానంలో నిలవగా మరియు బ్రెజిల్కు చెందిన మౌరిసియో డ సిల్వా 86.62 మీటర్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.
నీరజ్ చోప్రా మునుపటి డైమండ్ లీగ్ ప్రదర్శనలు:









- నీరజ్ చోప్రా చివరిసారిగా 2023 జూన్లో లుసానె డైమండ్ లీగ్లో టైటిల్ను గెలుచుకున్నాడు. ఈ పోటీలో అతను 87.66 మీటర్ల దూరం జావెలిన్ను విసిరి మొదటి స్థానంలో నిలిచాడు.
- 2025 మేలో జరిగిన దోహా డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రా 90.23 మీటర్ల దూరం జావెలిన్ను విసిరి తన కెరీర్లో మొట్టమొదటిసారిగా 90 మీటర్ల మార్కును అధిగమించాడు. ఈ పోటీలో అతను రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
- దోహా డైమండ్ లీగ్లో జర్మనీకి చెందిన జులియన్ వెబర్ చివరి రౌండ్లో 91.06 మీటర్ల త్రోతో నీరజ్ను అధిగమించి విజేతగా నిలిచాడు. వెబర్ కూడా 90 మీటర్ల మార్కును దాటడం ఇదే మొదటిసారి. ఈ పోటీ నీరజ్, వెబర్ ఇద్దరికీ మైలురాయిగా నిలిచింది.
పారిస్ డైమండ్ లీగ్ 2025 :
- పారిస్ డైమండ్ లీగ్ అనేది ప్రపంచ అథ్లెటిక్స్ (World Athletics) నిర్వహించే డైమండ్ లీగ్ సిరీస్లోని ఎనిమిదో మీటింగ్.
- 2025 జూన్ 20 తేదీన ఫ్రాన్స్లోని స్టేడ్ సెబాస్టియన్ చార్లెటీ (Stade Sébastien Charléty) లో జరిగినది