Brand new Course Package released! Get 30% off your first purchase with code “Eduma”. Find out more!

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భారత్ పురోగతి… SDG సూచీలో 99వ ర్యాంకు సాధించిన భారత్…!

  • ఐక్యరాజ్యసమితి నిర్దేశిత సుస్థిరాభివృద్ధి లక్ష్యాల(ఎస్డీజీ) సాధనలో భారతదేశం మొట్టమొదటి సారి తొలి 100 స్థానాల్లో చోటు దక్కించుకుంది. గత ఏడాది 109వ ర్యాంకు సాధించిన మన దేశం ఈ సారి 99 వ ర్యాంక్ తో పది స్థానాలను మెరుగుపరచుకుంది.
  • యూఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్ వర్క్ 10వ సుస్థిర అభివృద్ధి నివేదిక (ఎస్డీఆర్) వివరాలను జూన్ 24 న ప్రకటించింది.
  • మరో వైపు ప్రపంచ స్థాయిలో ఎస్డీజీ పురోగతి నిలిచిపోయిందని, 2015లో ఐఖ్యరాజ్య సమితి సభ్య దేశాలు ఆమోదించిన 17 లక్ష్యాల్లో 17 శాతం మాత్రమే సాధ్యమవుతాయని నివేదిక రచయితలు ఆందోళన వ్యక్తం చేశారు.
  • సంఘర్షణలు, వ్యవస్థాపరమైన లోపాలు, పరిమిత ఆర్థిక వనరులు తదితర అంశాలు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఎస్డీజీ పురోగతికి ఆటంకం కలిగిస్తున్నాయని ఈ నివేదిక పేర్కొంది.

ఎస్డీజీ ముఖ్యాంశాలు:

  • ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్ దేశాలు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఎస్డీజీ సూచీలో తొలి 20 స్థానాల్లో 19 ఐరోపా దేశాలు ఉన్నాయి.
  • 2030 నాటికి ఎస్డీజీని చేరుకోవడంలో మొత్తం 193 దేశాల పురోగతిని పాయింట్లు, దానికనుగుణంగా స్థానాల రూపంలో నివేదిక వెల్లడించింది.
  • ఈ ఏడాది ఎస్డీజీ సూచీలో 67 పాయింట్లతో భారత్ 99వ స్థానంలో నిలిచింది.
  • చైనా 74.4 పాయింట్లతో 67వ స్థానంలో, అమెరికా 75.2 పాయింట్లతో 44వ స్థానంలో ఉన్నాయి.
  • భారత్ సమీప ద్వీపదేశాలైన మాల్దీవులు 53వ స్థానంలో, శ్రీలంక 98వ స్థానంలో నిలిచింది.
  • పొరుగుదేశాలైన భూటాన్ 70.5 పాయింట్లతో 74వ స్థానంలో, నేపాల్ 68.6 పాయింట్లతో 85వ స్థానంతో భారత్ కన్నా ముందున్నాయి.
  • బంగ్లాదేశ్ 63. 9 పాయింట్లతో 114వ స్థానంలో, పాకిస్థాన్ 57 పాయింట్లతో 140వ స్థానంతో మన దేశం కన్నా వెనుకబడ్డాయి.

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (SDGs):

  • 2015లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రపంచ దేశాలు ఆమోదించిన “2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్”లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (Sustainable Development Goals – SDGs) అంతర్భాగం.
  • ఇందులో మొత్తం 17 లక్ష్యాలు, 169 ఉప-లక్ష్యాలు ఉన్నాయి. పేదరికం, ఆకలిని నిర్మూలించడం, ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వం, పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకుని, “ఎవ్వరినీ వెనుకబడనీయవద్దు” (Leave No One Behind) అనే సూత్రంతో ప్రపంచ దేశాలు ముందుకు సాగాలని ఈ లక్ష్యాలు నిర్దేశిస్తున్నాయి.

సస్టైనబుల్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ (SDR) మరియు SDG సూచీ:

  • ఐక్యరాజ్యసమితికి చెందిన సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్ (SDSN) ప్రతి సంవత్సరం “సస్టైనబుల్ డెవలప్‌మెంట్ రిపోర్ట్”ను విడుదల చేస్తుంది.
  • ఇది 17 లక్ష్యాల ఆధారంగా వివిధ దేశాల పురోగతిని విశ్లేషించి, ఒక స్కోరు మరియు ర్యాంకును కేటాయిస్తుంది. ఇది దేశాల పనితీరును అంచనా వేయడానికి ఒక ముఖ్యమైన అంతర్జాతీయ సాధనంగా పనిచేస్తుంది.

తాజా SDG సూచీలో భారతదేశం ప్రదర్శన (2025 రిపోర్ట్):

జూన్ 2025లో విడుదలైన తాజా సస్టైనబుల్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ ప్రకారం, భారతదేశం తన పనితీరును గణనీయంగా మెరుగుపరుచుకుంది.

  • ర్యాంకు: 167 దేశాలలో 99వ ర్యాంకును సాధించింది. చరిత్రలో తొలిసారిగా భారతదేశం టాప్-100 దేశాల జాబితాలోకి ప్రవేశించడం ఇది ఒక కీలక మైలురాయి.
  • స్కోరు: భారతదేశం 100కి 67.0 స్కోరును సాధించింది.
  • గత పనితీరుతో పోలిక: గత సంవత్సరాలతో పోలిస్తే ఇది చెప్పుకోదగ్గ పురోగతి. 2024 లో 109 వ ర్యాంకు, 2023లో 112వ ర్యాంకు, 2022లో 121వ ర్యాంకులో ఉన్న భారత్, స్థిరమైన ప్రగతిని సాధిస్తూ ముందుకు సాగుతోందని ఇది సూచిస్తుంది

Tags:

Share:

Book Your Seat

Please enable JavaScript in your browser to complete this form.

Book Your Seat Now!

Please enable JavaScript in your browser to complete this form.